కాంగ్రెస్ గూటికి ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి ?

కాంగ్రెస్  గూటికి ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి ?

పరిగి, వెలుగు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నేత మనోహర్ రెడ్డి గురువారం కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ విషయంపై బుధవారం రాత్రి మనోహర్ రెడ్డి స్పందిస్తూ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ లోకి వెళ్లడానికి ఇష్టపడుతున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6  గ్యారంటీ పథకాలకు ఆకర్షితుడినైనట్లు చెప్పారు. ఎలాంటి టికెట్ ఆశించడం లేదని,  పార్టీపై అభిమానంతో వెళుతున్నట్లు పేర్కొన్నారు. దీనిపై గురువారం  కాంగ్రెస్ పెద్దలతో కలిసి మీడియా ముందు వెల్లడించడానికి ఆయన సిద్ధమైనట్లు తెలుస్తుంది.