చేవెళ్ల, వెలుగు: మున్సిపల్ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. చివరి రోజైన శుక్రవారం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు భారీ ర్యాలీలతో తరలి వచ్చి నామినేషన్లను సమర్పించారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో (ఆమన్గల్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, షాద్నగర్, శంకర్పల్లి) 3 రోజుల్లో కలిపి 962 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
నేడు నామినేషన్ల పరిశీలన ఉండగా.. ఫిబ్రవరి 1న అప్పీళ్లు , ఫిబ్రవరి 2న అప్పీళ్లపై అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. అభ్యర్థుల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 చివరి తేదీగా నిర్ణయించారు. అదే రోజు రిటర్నింగ్ అధికారులు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 11న పోలింగ్ జరగనుంది.
