భద్రాచలంలో చిత్రకూట మండపంలో రాపత్ సేవ..హాజరైన దేవనాథ రామానుజ జీయర్ స్వామి

భద్రాచలంలో  చిత్రకూట మండపంలో రాపత్ సేవ..హాజరైన దేవనాథ రామానుజ జీయర్ స్వామి

భద్రాచలం, వెలుగు :  జీయర్ మఠం ఆధ్వర్యంలో గురువారం రామాలయంలోని చిత్రకూట మండపంలో రాపత్​ సేవ జరిగింది. స్వామిని ఊరేగింపుగా చిత్రకూటమండపానికి తీసుకురాగా, శ్రీశ్రీశ్రీ దేవనాథ రామానుజ జీయర్​ స్వామి ఆధ్వర్యంలో భక్తులు పాల్గొన్నారు. స్వామికి విశేష పూజలు, వేదపారాయణాలు చేశారు. 

మరోవైపు ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామికి అధ్యయన పారాయణాలు నిర్వహించారు. సీతారాముల నిత్య కల్యాణం జరిగింది. నమ్మాళ్వార్​ పరమపదోత్సవం వేదోక్తంగా వేదపండితులు జరిపించారు. సాయంత్రం వైకుంఠ రామునికి తిరువీధి సేవ ఘనంగా జరిగింది.