
హైదరాబాద్, వెలుగు: రైడ్-షేరింగ్ ప్లాట్ఫామ్ ర్యాపిడో, తన బైక్ టాక్సీ, క్యాబ్ కెప్టెన్లకు వాహన నిర్వహణ ప్రయోజనాలను అందించేందుకు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)తో గురువారం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం మొదట హైదరాబాద్లో మొదలయింది. రానున్న రోజుల్లో భారతదేశంలోని 11 నగరాలకు విస్తరించనుంది.
3.8 లక్షల మందికిపైగా కెప్టెన్లకు ఈ ఒప్పందం వల్ల మేలు జరుగుతుందని ర్యాపిడో తెలిపింది. హైదరాబాద్లోని అన్ని హెచ్పీసీఎల్ స్టేషన్లలో ఇంధనంపై 1.25శాతం తగ్గింపు ఉంటుంది. హెచ్పీ లూబ్రికెంట్, వాహన్ కిట్పై 50శాతం తగ్గింపు ఇస్తారు. హైదరాబాద్లోని 300కుపైగా హెచ్పీసీఎల్ బంకుల్లో ఈ ప్రయోజనాలు పొందవచ్చు.