
- పేషెంట్ మెదడులో కణితిని తొలగించి డాక్టర్ల సక్సెస్
పంజగుట్ట,వెలుగు: నిమ్స్ డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేసి పేషెంట్ ప్రాణాలు కాపాడారు. సంగారెడ్డికి చెందిన నరహరి5(35) కొంతకాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతూ.. నెల రోజుల కిందట నిమ్స్ ఆస్పత్రిలో న్యూరో సర్జరీ డాక్టర్లను సంప్రదించాడు. అతనికి వైద్య పరీక్షలు చేసి మెదడు మధ్యలో కణితి (బ్రెయిన్ట్యూమర్)ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ ద్వారా తొలగించాలని పేషెంట్ కు సూచించారు.
న్యూరో సర్జన్ డాక్టర్ తిరుమల్ టీమ్ నితిన్, విశాల్, దీపక్ ఆపరేషన్ చేసి నరహరి మెదడులో కణితిని తొలగించారు. ఆపరేషన్ సక్సెస్ అవడంతో ఆస్పత్రి డైరెక్టర్ బీరప్ప, న్యూరో సర్జన్ వింగ్ హెడ్ డాక్టర్ సుచంద, డాక్టర్వంశీ కృష్ణను అభినందించారు.