
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandana) తన మేనేజర్ తో కలిసి ఇక పనిచేయడం లేదనే విషయంపై మీడియాలో పలు కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్ పై తాజాగా స్పందించింది హీరోయిన్ రష్మిక. ఇందులో భాగంగా తాము విడిగా పని చేయాలని నిర్ణయించుకోవడం వెనక ఎలాంటి గొడవలు లేవని తెలిపింది.
"ఇన్నిరోజులు ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందంతో విడిగా కెరీర్ లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రొఫెషనల్ గా ఉండే వాళ్లం కాబట్టి.. ఇన్నిరోజులు అలాగే కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు అంతే హుందాగా విడిగా పని చేయాలని నిర్ణయించుకున్నాం అని రష్మిక, ఆమె మేనేజర్ తాజా ప్రకటనలో తెలిపారు.
ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న పుష్ప ది రూల్(Pushpa the rule) సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir kapoor), సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga) కాంబోలో వస్తన్న యానిమల్(Animal) సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది ఈ బ్యూటీ. మరి ఈ సినిమాలు రష్మిక కెరీర్ లో ఏ రేంజ్ హిట్ గా నిలుస్తాయి చూడాలి.