విశాఖపట్నం: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్) ఏప్రిల్ – సెప్టెంబర్లో రికార్డ్ లెవెల్లో అమ్మకాలు జరిపింది. సంస్థ ఏర్పడ్డాక అత్యధిక వైర్ రాడ్ కాయిల్స్ (డబ్ల్యూఆర్సీ), స్ట్రక్చరల్ స్టీల్, వాల్యూ యాడెడ్ స్టీల్ (వీఏఎస్) సేల్స్ జరిగాయని కంపెనీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 3.64 లక్షల టన్నుల డబ్ల్యూఆర్సీ, 2.23 లక్షల టన్నుల స్ట్రక్చరల్ స్టీల్, 6.82 లక్షల టన్నుల వీఏఎస్ అమ్మింది.
కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే టైమ్లో జరిపిన సేల్స్తో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. కంపెనీ టర్నోవర్ ఏప్రిల్–సెప్టెంబర్ క్వార్టర్లో రూ.10,780 కోట్లకు పెరిగింది. అంతేకాకుండా బ్లాస్ట్ ఫర్నేస్ 1, 2 నుంచి 23 లక్షల టన్నుల హాట్ మెటల్ను ఉత్పత్తి చేసింది. ఈ పెర్ఫార్మెన్స్ కొనసాగుతుందని వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ అన్నారు