భగీరథ నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో రాస్తారోకో

భగీరథ నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో రాస్తారోకో

జగిత్యాల జిల్లా: ధర్మపురిలో ఖాళీ బిందెలతో మహిళలు రాస్తారోకో చేశారు. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని నిరసన తెలిపారు. 5 రోజుల నుంచి  తాగునీరు రావడం లేదని ఒడ్డెర కాలనీకి చెందిన స్థానికులు ఆందోళన చేశారు. సబ్ స్టేషన్ దగ్గర  రోడ్డుపై బిందెలు పెట్టి నిరసనకు దిగడంతో.. ధర్మపురి-రాయపట్నం రోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల వచ్చి చెప్పడంతో రాస్తారోకో విరమించారు స్థానికులు