స్వామి మన్నించు : యాదాద్రి పులిహోర ప్రసాదంలో చచ్చిన ఎలుక

స్వామి మన్నించు : యాదాద్రి పులిహోర ప్రసాదంలో చచ్చిన ఎలుక

యాదాద్రి పులిహోర ప్రసాదంలో   ఎలుక రావడం కలకలం రేపుతోంది.  యాదాద్రి దర్శనం చేసుకున్న ఓ  భక్తుడు పులిహోర ప్యాకెట్ కొన్నాడు. ప్రసాదం తినడానికి ప్యాకెట్  ఓపెన్ చేయగానే  చనిపోయిన ఎలుక కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఖంగు తిన్నాడు భక్తుడు. ప్రసాదంలో ఎలుక రావడంతో అక్కడున్న  భక్తులంతా భయాందోళనకు గురయ్యారు. 

రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన  యాదాద్రి ఆలయంలో ఇలాంటి ఘటన జరగడంపై భక్తులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మరో వైపు ఈ విషయం తెలిసిన బీజేపీ కార్యకార్తలు యాదగిరి గుట్టపై ఉన్న ఈఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. భక్తులకు ప్రసాదాల తయారు చేయడంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపైన కనీస సౌకర్యాలు .. అందరికీ ఉచిత అన్న ప్రసాదం కల్పించాలని డిమాండ్ చేశారు.