దుబాయ్: రీఎంట్రీ కోసం కంగారుపడితే రోహిత్ శర్మ మళ్లీ గాయపడే ప్రమాదముందని టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. బీసీసీఐకి అందిన మెడికల్ రిపోర్టు ప్రకారమే సెలెక్టర్లు రోహిత్ను ఆస్ట్రేలియా టూర్కు ఎంపిక చేయలేదని తెలిపాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ కు హ్యామ్స్ట్రింగ్(మోకాలి కండరాల్లో) ఇంజ్యురీ అయ్యింది. దీంతో పలు మ్యాచ్లకు దూరమయ్యాడు. రోహిత్ ఇటీవల ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటికీ.. అతన్ని ఆసీస్ టూర్కు ఎంపిక చేయకపోవడంపై రవిశాస్త్రి స్పందించాడు. ‘ ముంబై టీమ్ బీసీసీఐకి పంపిన మెడికల్ రిపోర్ట్ ఆధారంగా రోహిత్ అంశంలో సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే, రిపోర్ట్స్ ప్రకారం ముంబైకర్ మళ్లీ గాయపడే చాన్సుంది. అందువల్ల రోహిత్ తొందరపడకూడదు. రోహిత్తోపాటు ఇషాంత్ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్లు లేకపోవడం జట్టుకు చాలా లోటు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.