- రాజేంద్రనగర్ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ప్రచారం
గండిపేట, వెలుగు: తెలంగాణలో బీజేపీ గెలవడం ఖాయమని బీజేపీ గోరక్పూర్ ఎంపీ, సినీ నటుడు రవికిషన్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం రాజేంద్రనగర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా రవికిషన్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకు తగ్గిపోతుందన్నారు. నిత్యం జనాల్లో ఉండే నేత తోకల శ్రీనివాస్ రెడ్డిని రాజేంద్రనగర్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రోడ్ షోలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనం పాల్గొన్నారు.