
ముంబై: కార్డుల టోకెనైజేషన్ డెడ్లైన్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జూన్ 30, 2022 దాకా పొడిగించింది. అంతకు ముందు డిసెంబర్31, 2021 ని గడువుగా ఆర్బీఐ నిర్ణయించింది. కానీ, పేమెంట్ సంస్థలు, బ్యాంకులు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)ల విజ్ఞప్తి మీద టోకెనైజేషన్ డెడ్లైన్ను పొడగించారు. కార్డు ఇష్యూయర్లు కాని సంస్థలు ఏవీ కస్టమర్ల కార్డుల డేటాను తమ సర్వర్లలో స్టోర్ చేయడానికి వీలులేదనే కొత్త నిబంధనను ఆర్బీఐ అమలులోకి తెస్తోంది. దీనికి బదులుగా టోకెనైజేషన్ ప్రాసెస్ను లేదా మరేదైనా ఆల్టర్నేటివ్ విధానాన్ని అమలు చేయాలని నిర్దేశించింది. కార్డు దారుల ప్రొటెక్షన్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వివరించింది. కార్డ్ ఆన్ ఫైల్ (సీఓఎఫ్) రూల్ అమలును మరో ఆరు నెలలు వాయిదా వేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. సీఓఎఫ్ రూల్ అమలుకు ఇంకా తాము రెడీగా లేమని, మరి కొంత కాలం పడుతుందని మర్చంట్ పేమెంట్స్ అలయన్స్ ఆఫ్ ఇండియా (ఎంపీఏఐ), అలయన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ (ఏడీఐఎఫ్) వంటి సంస్థలు ఆర్బీఐకి తెలియచేశాయి.