బ్యాంక్ వడ్డీ రేట్లు మారలేదు.. EMI తగ్గలేదు.. పెరగలేదు

బ్యాంక్ వడ్డీ రేట్లు మారలేదు.. EMI తగ్గలేదు.. పెరగలేదు

ముంబై: ముంబై: రెపోరేటును మరోసారి స్థిరంగా ఉంచింది రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. పాత రెపోరేటు5.50 శాతాన్ని కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో EMI  చెల్లించే వారిపై భారం పడలేదు. రెపోరేటు పెరిగితే బ్యాంకులకు రుణ ఖర్చుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో  EMI  తగ్గలేదు..పెరగలేదు.  రెపోరేటు తగ్గితే ఎంతో కొంత ఊరట ఉంటుందనుకున్న సామాన్యులకు పండుగ వేళ ఆర్బీఐ నిరాశపర్చింది.    

RBI రెపో రేటులో మార్పులు రుణాలకు ముఖ్యంగా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు ఉన్న వాటికి EMI ని నేరుగా ప్రభావితం చేస్తాయి. RBI రెపో రేటును పెంచినప్పుడు అది బ్యాంకులకు రుణ ఖర్చులను పెంచుతుంది. దీంతో రుణ వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఫలితంగా రుణగ్రహీతలకు EMIలు పెరుగుతాయి. 

రెపో రేటు తగ్గితే బ్యాంకులకు రుణాలు ఖర్చులు తగ్గుతాయి. ఫలితంగా వడ్డీ రేట్లు తగ్గుతాయి,కస్టమర్లకు EMIలు తగ్గుతాయి. ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలకు ప్రభావం వారి రుణం వడ్డీ రేటు రకం,బ్యాంకర్ల విధానంపై ఆధారపడి ఉంటుంది. రెపో-లింక్డ్ రుణాలు సాధారణంగా త్వరగా మార్పులను ఉంటాయి.

బుధవారం (అక్టోబర్​1) ఉదయం  2025–26 ఆర్థిక సంవత్సరానికి RBI ద్రవ్య విధాన కమిటీ (MPC) నాల్గవ సమావేశం జరిగింది. రెపో రేటును స్థిరంగా ఉంచుతూ ద్రవ్యవిధాన కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది..ఫలితం రెపోరేటు 5.5శాతం, బ్యాంక్ రేటు 5.75శాతం వద్దనే ఉన్నాయి. అని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. 

రెపో రేటును స్థిరంగా ఉంచుతూ ద్రవ్యవిధాన కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది..ఫలితం రెపోరేటు 5.5శాతం, బ్యాంక్ రేటు 5.75శాతం వద్దనే ఉన్నాయి. అని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు.