
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర రెగ్యులేటెడ్ ఎంటిటీల ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాన్- ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లలోని ప్రాజెక్టులకు ఇచ్చే ఫైనాన్షింగ్పై కొత్త నిబంధనలను జారీ చేసింది. ప్రాజెక్టులు 'కమర్షియల్గా ప్రారంభమైన తేదీ నుంచి’ (డీసీసీఓ) రూల్ను సవరించింది. డీసీసీఓ ఎక్స్టెన్షన్లను రేషనలైజ్ చేసింది.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్కు 3 ఏళ్లు, నాన్ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్కు 2 ఏళ్ల వరకు లిమిట్ ఇచ్చింది. ఆర్బీఐ ప్రాజెక్టులను డిజైన్ ఫేజ్, కన్స్ట్రక్షన్ ఫేజ్, ఆపరేషనల్ ఫేజ్ అని మూడు దశలుగా విభజించింది. “కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టుల్లో లెండర్స్ ఇచ్చిన మొత్తం అప్పు రూ. 1,500 కోట్ల వరకు ఉంటే, ఏ ఒక్క లెండర్ ఎక్స్పోజర్ కూడా మొత్తం అప్పులో 10శాతం కంటే తక్కువ ఉండకూడదు” అని ఆర్బీఐ చెప్పింది. రూ. 1,500 కోట్ల కంటే ఎక్కువ మొత్తం అప్పు ఉన్న ప్రాజెక్టుల్లో, ఒక్కో లెండర్ ఎక్స్పోజర్ ఫ్లోర్ 5శాతం ఉండాలి.
ఫైనాన్స్ ఇచ్చే ముందే ప్రాజెక్ట్ అమలు/నిర్మాణం కోసం అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయో లేదో లెండర్ చూసుకోవాలి. ఇందులో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, లీగల్ క్లియరెన్స్, రెగ్యులేటరీ క్లియరెన్సెస్ వంటివి ఉన్నాయి. మొండిబాకీలను తగ్గించుకోవడంలో ప్రాజెక్ట్ పనితీరును నిరంతరం మానిటర్ చేయాలి.