
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 కు వర్షం అంతరాయం కొనసాగుతోంది. ఆదివారం (జూన్ 1) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ప్రారంభమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. మొదటిలో చిరు జల్లులతో ప్రారంభమైన వర్షం భారీ వర్షానికి దారి తీసింది. మధ్యలో కాసేపు వర్షం ఆగినా అంపైర్లు పిచ్ మీదకు వచ్చేసరికి మళ్ళీ వర్షం కురిసింది. ఇక ఈ మ్యాచ్ కు ఆశ్చర్యకరంగా ఆర్సీబీ ఫ్యాన్స్ రావడం ఆసక్తికరంగా మారింది.
ఓ వైపు వర్షం పడుతుంటే వీరు మాత్రం కర్రలతో కోలాటం చేసుకుంటూ కనిపించారు. వర్షం మ్యాచ్ కు అంతరాయం కలిగించడంతో వీరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ కు ఆర్సీబీ ఫ్యాన్స్ భారీగా వచ్చినట్టు తెలుస్తుంది. బెంగళూరు కూడా తమ ఫైనల్ మ్యాచ్ ను ఇక్కడే ఆడాల్సి ఉంది. దీంతో ఈ మ్యాచ్ చూద్దామని సరదాగా వచ్చి ఉంటారు. స్టేడియం మొత్తం వీరి హడావుడి ఉన్నట్టు తెలుస్తుంది. పంజాబ్ మీద క్వాలిఫయర్ 1 లో విజయం సాధించిన ఆర్సీబీ మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్ లో ఫైనల్ ఆడనుంది.
ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్తుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్లేయింగ్ 11 లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ముంబై ఒక మార్పుతో బరిలోకి దిగింది. గ్లేస్సన్ స్థానంలో టొప్లీ తుది జట్టులో స్థానం సంపాదించాడు.
RCB fans enjoying Garba in Ahmedabad 😍
— CricTracker (@Cricketracker) June 1, 2025
📷: JioHotstar pic.twitter.com/5iWuwnnslU