IPL 2025: RCB ఫ్యాన్స్ వీరాభిమానం.. ఐపీఎల్ ఫైనల్ క్రేజ్‌కు పెళ్లి కూడా ఆగింది

IPL 2025: RCB ఫ్యాన్స్ వీరాభిమానం.. ఐపీఎల్ ఫైనల్ క్రేజ్‌కు పెళ్లి కూడా ఆగింది

మంగళవారం (జూన్ 3) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు దేశమంతా ఆసక్తి చూపించారు. ఇప్పటివరకు టైటిల్ లేని రెండు జట్లు ఐపీఎల్ ఫైనల్లో పోరాడడం.. అందులోనూ ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్ ఆడుతుండడంతో క్రేజ్ ఆకాశాన్ని దాటేసింది. ఆర్సీబీ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా చూశారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ను చూడడానికి బీసీసీఐ పెద్దలతో పాటు.. ఆర్సీబీ మాజీ ఆటగాళ్లు.. మాజీ యూకే ముఖ్యమంత్రి రిషి సునక్ హాజరయ్యారు. 

ఈ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ ధాటికి ఏకంగా ఒక పెళ్లి కాసేపు వాయిదా పడడం ఆశ్చర్యకరంగా మారింది. ఒక పెళ్లి ఫంక్షన్ లో ఐపీఎల్ మ్యాచ్ పెట్టారు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడంతో అందరూ పెళ్లి కంటే ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపించారు. మ్యాచ్ క్లైమాక్స్ కు వచ్చేసరికి వధువు, వరుడు సైతం మ్యాచ్ లో లీనమైపోయారు. కొన్ని నిమిషాలు అక్కడ జరుగుతుంది పెళ్లి అని మర్చిపోయి మ్యాచ్ చూస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.   

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్‌ వేదికగా  పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. 17 ఏళ్లుగా ఎదురు చూసిన ట్రోఫీ 18వ ప్రయత్నంలో సాధించి తమ కప్ కళను నెరవేర్చుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 7 వికెట్లకు 184 పరుగులకు పరిమితమైంది.