పేలిన రియాక్టర్..ముగ్గురికి తీవ్రగాయాలు

పేలిన రియాక్టర్..ముగ్గురికి తీవ్రగాయాలు

హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో  భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి రసాయనిక పొగలు జీడిమెట్లను కమ్మేశాయి.

జీడిమెట్ల జీవిక లైఫ్ సైన్స్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ శబ్దంతో పేలుడు జరిగింది. దట్టమైన రసాయనిక పొగలతో కంపెనీ కార్మికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న  ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుడు సమయంలో కంపెనీలో పనిచేస్తున్న నలుగురు కార్మికులు లోపల చిక్కుకున్నారు. ప్రమాదంలో  అన్వర్ అనే కార్మికుడు సంఘటనా స్థలంలోమృతిచెందగా..మరో కార్మికుడు అంబరీష్ నగేష్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అంబరీష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పేలుడు అనంతరం కంపెనీ యాజమాన్యం పరారైనట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.