
ప్యాడ్ 2 పేరుతో మిడ్ రేంజ్ ట్యాబ్లెట్ను మనదేశంలో రియల్మీ లాంచ్ చేసింది. అమ్మకాలు వచ్చే నెల మొదటి వారం నుంచి మొదలవుతాయి. ఇందులో 11.50 ఇంచుల డిస్ప్లే, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 8,360 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ ఉంటాయి. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 19,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ కాన్ఫిగరేషన్ ధర రూ. 22,999.