
మల్కాజిగిరి, వెలుగు: నగరంలో అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఓ వ్యాపారిని కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం సాయంత్రం కుషాయిగూడలోని మంగాపూర్ కాలనీలో రియల్ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్రెడ్డి(42)పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశారు.
స్థానికులు ఒక నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అతడిని లాలాపేటకు చెందిన డానియల్ జోసెఫ్ గా గుర్తించారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని ధనరాజ్గా అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏర్పడిన తగాదాలే ఈ హత్యకు కారణంగా ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుడికి కొడుకు, కుమార్తె ఉన్నారు.