మహబూబాబాద్/ ములుగు/ భూపాలపల్లి రూరల్/ జనగామ అర్బన్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయా కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. మహబూబాబాద్ ప్రజావాణిలో 97 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ములుగులో కలెక్టర్ దివాకర దరఖాస్తులను స్వీకరించగా, 62 వినతులు వచ్చాయని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లిలో 37 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు.
జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు వివిధ సమస్యలపై 39 అర్జీలు వచ్చాయని అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్ తెలిపారు. హనుమకొండలో నిర్వహించి ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి దరఖాస్తులు స్వీకరించి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
ట్రై సైకిల్ ఇప్పించండి సారూ..
హనుమకొండకు చెందిన షేక్ హైదర్ 55 ఏండ్ల దివ్యాంగుడు. వృద్ధాప్యం మీదపడుతుండడంతో నడవలేని స్థితిలో ఉన్నానని, మూడు నెలల కింద ట్రై సైకిల్ కోసం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నాని తెలిపాడు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఇలా అతికష్టం మీద వచ్చి, మరోమారు ట్రై సైకిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
