హైదరాబాద్, వెలుగు: నిమజ్జనం రోజు మెట్రో ట్రైన్లలో రికార్డ్ స్థాయిలో ప్యాసింజర్లు జర్నీ చేశారు. శుక్రవారం ఒక్కరోజే 3 మెట్రో కారిడార్లలో 4 లక్షల మందికి పైగా జర్నీ చేసినట్లు అధికారులు తెలిపారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా అధికారులు శుక్రవారం మెట్రో రైల్ టైమింగ్స్ను పొడిగించిన విషయం తెలిసిందే. ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు చివరి ట్రైన్ నడిచింది.
తెల్లవారుజామున 2 గంటలకు ఆ ట్రైన్లు స్టేషన్లకు చేరుకున్నాయి. మియాపూర్–ఎల్బీ నగర్ కారిడార్లో 2 లక్షల 46 వేల191మంది, నాగోల్–రాయదుర్గం కారిడార్లో లక్షా 49వేల 295 మంది, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్లో 22 వేల 304 మంది జర్నీ చేశారు.
బడా గణేశ్ దర్శనం, శోభాయాత్రతో పాటు నిమజ్జనాలను నేరుగా చూసేందుకు ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్కు చేరుకున్నారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో 40 వేల మంది ఎగ్జిట్ కాగా, 22,500 మంది ఎంట్రీ అయినట్లు అధికారులు చెప్పారు.