
రెడ్మీ ప్యాడ్ 2 బుధవారం (జూన్ 1) ఇండియాలో లాంచ్ అయింది. ఈ టాబ్లెట్లో 90హెడ్జ్ రిఫ్రెష్ రేట్తో కూడిన 11-ఇంచుల 2.5కే డిస్ప్లే ఉంది. 9,000ఎంఏహెచ్ బ్యాటరీ, 6ఎన్ఎం ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో జీ100-అల్ట్రా చిప్సెట్తో నడుస్తుంది. వై-ఫై ఓన్లీ, వై-ఫై + సెల్యులార్.. రెండు ఆప్షన్స్లో రెడ్మీ ప్యాడ్2 లభిస్తోంది. దీని 4జీబీ + 128జీబీ (వై-ఫై ఓన్లీ) ధర రూ. 13,999. 6జీబీ + 128జీబీ (వై-ఫై + 4జీ) ధర రూ. 15,999.
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫిలిప్స్, భారతదేశ మార్కెట్లో మిరాజ్ సిరీస్ టీవీలను విడుదల చేసింది. ఈ కొత్త టీవీలు 32 , 43 అంగుళాల స్క్రీన్ సైజులలో అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్కార్ట్ ద్వారా వీటిని ఆర్డర్ చేయవచ్చు. ఐ కంఫర్ట్, 20 వాట్ల స్పీకర్, డాల్బీ ఆట్మోస్ సౌండ్, హెచ్డీఆర్10, హెచ్ఎల్జీ సపోర్ట్, గూగుల్ టీవీ ఓఎస్, 1.5 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ టీవీల్లో ఉంటాయి. ధరలు రూ.10 వేల నుంచి మొదలవుతాయి.
వివో సబ్-బ్రాండ్ ఐక్యూ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో ఐక్యూ జెడ్10 లైట్ 5జీని తీసుకొచ్చింది. ఇందులో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్తో రెండు వెనుక కెమెరాలు, ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐక్యూ జెడ్10 లైట్ 5జీ 4జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 10 వేలు కాగా, 6జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 11 వేలు. 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ ధర రూ. 17 వేలు.