
అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 6 లక్షలు జరిమానా విధించబడింది. తిరుపతిలోని ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు ఈ శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులపై ఎర్రచందనం అక్రమ రవాణా కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే....
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ 2019 లో పట్టుబడిన 10 మంది స్మగ్లర్లు ఒకొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి గురువారం ( జులై 31)సంచలన తీర్పు నిచ్చారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు నిందితులను దోషులుగా నిర్దారించేందుకు కావలసిన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు.
పెరుమాల్లపల్లి బీటు, టీఏన్ పాలెం సెక్షన్ ఎస్వీఎన్పీ డివిజన్ లో అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. వీరు క్రైమ్ నెంబరు 59/2019 కేసులో 10 మంది ముద్దాయిలు అరెస్టయ్యారు. వీరు తమిళనాడు లోని తిరువన్నామలై, వేలూరు జిల్లాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. అయితే ఈ రోజు ముద్దాయిల్లో ప్రభు అనే ముద్దాయి హాజరు కాకపోవడంతో ఆయనకు నాన్ బెయిల్ బుల్ వారంట్ జారీ చేశారు.
దోషుల వివరాలు
- 1. సి. విశ్వనాథన్
- 2. డి సేతు
- 3. డి. రమేష్
- 4. ఎం. సంపత్
- 5. వి.రత్నం
- 6. ఎం. బూఛాయాన్
- 7. జె. కుమార్
- 8. సి. ప్రభు
- 9. ఎం. సురేష్
- 10.. సి.రామర్
ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం రిజర్వు ఫారెస్టులో అతి విలువైన సహజ సంపద అయిన ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడమే కాకుండా, అడవిలోకి అక్రమ ప్రవేశం చేసిన నేరస్తులకు కూడా ఇది ఒక హెచ్చరిక అని టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ తెలిపారు. ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా సహకరిస్తున్న కోర్టు సిబ్బందిని అభినందించారు.
►ALSO READ | అట్టపెట్టెల్లో 11 కోట్లు.. ఏపీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు