క్యాన్సర్, మధుమేహం తగ్గాలంటే 'పింక్ జామ' తినాల్సిందేనట

క్యాన్సర్, మధుమేహం తగ్గాలంటే 'పింక్ జామ' తినాల్సిందేనట

చలికాలంలో లభించే అనేక పండ్లు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ పండ్లలో పింక్ జామ ఒకటి. ఇది చాలా మందికి ఇష్టమైన పండు. దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇది అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. సాధారణంగా రెండు రకాల జామపళ్లు కనిపిస్తాయి. ఒకటి లోపల తెల్లగా, మరొకటి ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటుంది. ఈ రెండు జామపళ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అయితే, ఎర్ర జామపండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మీరు కూడా ఈ జామపండును తినడానికి ఇష్టపడే వారైతే.. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడే తెలుసుకోండి:

మధుమేహానికి మేలు చేస్తుంది:

ఈ రకమైన జామలో పుష్కలంగా ఫైబర్, నీరు ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి పండు అని చెప్పడానికి ఇవే కారణం. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా తగ్గిస్తుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నివారించడంలోనూ సహాయపడుతుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

పింక్ జామలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

పింక్ జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మానికి మేలు చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది, త్వరగా గాయం నయం చేయడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడంలో సహాయకారిగా ఉంటుంది:

ఇది అధిక మొత్తంలో నీరు, ఫైబర్ కంటెంట్‌తో పాటు ఇతర పోషకాలను కూడా కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది గొప్ప ఎంపిక.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది:

పింక్ జామలో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది:

యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, లైకోపీన్ గులాబీ జామలో సమృద్ధిగా ఉంటాయి, ఇది మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది:

గులాబీ జామలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా, ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నరాల, కండరాల సంకోచ పనితీరుకు ఇది సహకరిస్తుంది.