పెళ్లిలో లొల్లి.. డీజే కోసం కొట్టుకున్న బంధువులు

పెళ్లిలో లొల్లి..  డీజే కోసం కొట్టుకున్న బంధువులు

పెళ్లి సందడిలో డీజే చిచ్చు పెట్టింది. డీజే వద్దన్నందుకు పెళ్లి మండపంలోనే తన్నుకున్నారు బంధువులు. సూర్యాపేట జిల్లా, ప్రకాశం జిల్లాకు చెందిన వధూవరులకు పెళ్లయింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో ఓ జంటకు పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత అబ్బాయి, అమ్మాయి తరఫు వాళ్లు బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. అయితే డీజేతో ఊరేగింపుగా వెళ్లాలని అబ్బాయి తరఫు వాళ్లు పట్టుపట్టారు. ప్రకాశం జిల్లాకు వెళ్లేందుకు లేటవుతుందని.. ఊరేగింపునకు అమ్మాయి వాళ్లు ససేమిరా అన్నారు. అక్కడే గొడవ స్టార్టయింది. ఇంకేముందు రెండువర్గాలు చైర్లు విరిగేలా కొట్టుకున్నారు.