న్యూఢిల్లీ : అంతరిక్ష రంగంలో పెట్టుబడులకు వివిధ దేశాలు, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) నిబంధనలను కేంద్ర కేబినెట్ సడలించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు ఎఫ్ డీఐ పాలసీ నిబంధనల సవరణకు ఆమోదం తెలిపింది. తాజా సడలింపు ప్రకారం.. లాంచ్ వెహికల్స్(రాకెట్స్), వాటికి సంబంధించిన వ్యవస్థల తయారీ, స్పేస్ పోర్టుల నిర్మాణానికి సంబంధించి ఆటోమేటిక్ రూట్లో ఎఫ్డీఐలను 49 శాతానికి పెంచారు.
అలాగే శాటిలైట్ల తయారీ, నిర్వహణ, శాటిలైట్ డేటా ప్రొడక్టులు, గ్రౌండ్ సెగ్మెంట్, యూజర్ సెగ్మెంట్ల వంటి వాటికి ఆటోమేటిక్ రూట్ లో ఎఫ్డీఐలు 74 శాతానికి పెరిగాయి. ఇంతకంటే ఎక్కువ ఎఫ్ డీఐల సేకరణకు మాత్రం ప్రభుత్వ అనుమతి తీసుకోలి. ఇక స్పేస్ సెక్టార్లో పార్ట్స్, శాటిలైట్ సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్ తయారీ వంటి కొన్ని యాక్టివిటీల్లో ఎఫ్డీఐలు100 శాతానికి పెరగనున్నాయి.