ఇంటర్ రీవెరిఫికేషన్-రీకౌంటింగ్ ఫలితాల విడుదల

ఇంటర్ రీవెరిఫికేషన్-రీకౌంటింగ్ ఫలితాల విడుదల

తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ రీవెరిఫికేషన్-రీకౌంటింగ్ ఫలితాలను విడుదల చేసింది. ఇంటర్ ఫలితాల విడుదలలో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలతో రాష్ట్రంలో అలజడి తర్వాత కోర్టు ఆదేశాలతో ఇవాళ(సోమవారం) రీఫెరిఫికేషన్ ఫలితాలు ప్రకటించింది. విద్యార్థుల జవాబు పత్రాలను కూడా ఆన్‌లైన్‌లో పెట్టింది. మొత్తం 3.82 లక్షల మంది ప్రశ్నపత్రాల రీవెరిఫికేషన్ ఫలితాలలో 1,137 మంది ఉత్తీర్ణులైనట్లుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. మొత్తం ప్రశ్నపత్రాలలో 19,788 మంది జవాబు పాత్రల స్కానింగ్ పూర్తి చేయాల్సి ఉందని, అవి కూడా ఈ రాత్రికి లేదా రేపు వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు ఇంటర్ బోర్డు అధికారులు.