రాజధాని రైతులకు కౌలు డబ్బులు విడుదల

రాజధాని రైతులకు కౌలు డబ్బులు విడుదల

అమరావతి : రాజధానికి భూములిచ్చిన రైతులకు గుడ్ న్యూస్ అందించారు సీఎం జగన్. రాజధాని రైతులకు కౌలు డబ్బులను విడుదల జూస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దీనిద్వారా ప్రభుత్వం అన్నదాతలకు ఏడాది కౌలు రూ. 187.4 4 కోట్లు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాజధాని రైతులకు కౌలు చెల్లించేందుకు వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని సీఆర్డీఏ, మున్సిపల్ శాఖలను ఆదేశించినట్లు ఉత్తర్వుల్లో తెలిపింది ఏపీ ప్రభుత్వం. మూడు నెలలుగా ప్రభుత్వం కౌలు చెల్లించకపోవడంతో..రాజధానికి భూములిచ్చిన రైతలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.