
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) మంగళవారం ట్రేడింగ్లో షేర్లు దాదాపు 2 శాతం పెరగడంతో మార్కెట్క్యాప్ రూ. 20 లక్షల కోట్లకు చేరుకుంది.ఈ మైలురాయిని దాటిన మొట్టమొదటి లిస్టెడ్ సంస్థగా అవతరించింది. బీఎస్ఈలో ఆర్ఐఎల్ షేర్లు 1.88 శాతం లాభపడి గరిష్టంగా రూ.2,957.80కి చేరాయి. అయితే చివరికి 0.74 శాతం లాభంతో రూ.2,926 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల తన ఆర్థిక సేవల విభాగాన్ని విడదీసింది. దీని పేరును జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్ఎస్) గా మార్చింది.
డీమెర్జ్డ్ ఎంటిటీ స్టాక్ కూడా ఎక్స్ఛేంజీలలో లిస్ట్అయింది. దీని మార్కెట్క్యాప్ రూ. 1,70,331.55 కోట్ల వరకు ఉంది. రిలయన్స్ షేర్లు ఇటీవల లాభపడటంతో సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ సంపద 109 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2024లోనే ఈయన సంపదన 12.5 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం అంబానీ అత్యంత సంపన్న భారతీయుడేగాక ప్రపంచంలో 11వ అత్యంత ధనవంతుడు. రిలయన్స్కు ఆయిల్, టెలికం డిజిటల్ సేవలు, రిటైల్ వంటి పలు వ్యాపారాలు ఉన్నాయి.