
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్కటే ఇండియా నుంచి గ్లోబల్గా టాప్ 30 పబ్లిక్గా ట్రేడ్ అయ్యే టెక్నాలజీ కంపెనీల లిస్ట్లో చోటు సంపాదించింది. ‘ట్రెండ్స్ - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ రిపోర్ట్ ప్రకారం, ఏఐ టెక్నాలజీ వాడకం వేగంగా పెరుగుతోంది.
మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి టాప్ గ్లోబల్ టెక్ కంపెనీల లిస్టులో టాప్ 8 ప్లేస్లలో యూఎస్ టెక్ కంపెనీలు- మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, అమెజాన్, ఆల్ఫాబెట్, మెటా ప్లాట్ఫామ్స్, టెస్లా, బ్రాడ్కామ్ ఉన్నాయి. తైవాన్ టీఎస్ఎంసీ 9వ ర్యాంక్లో, చైనా టెన్సెంట్ 10వ ర్యాంక్లో ఉన్నాయి. 216 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్తో రిలయన్స్ 23వ ర్యాంక్లో ఉంది.