రిలయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్ల కోసం ఎగబడ్డారు

రిలయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్ల కోసం ఎగబడ్డారు

ముంబై: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ డీమెర్జర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేట్ ప్రకటించడంతో   ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెవీ వెయిట్ షేర్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సోమవారం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ర్యాలీ చేసింది. షేర్లను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఎగబడడంతో రిలయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంట్రాడేలో 4.5 శాతం పెరిగి రూ.2,755 దగ్గర సరికొత్త ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్ హైని నమోదు చేసింది. చివరికి 3.86 శాతం లాభంతో రూ 2,735 దగ్గర క్లోజయ్యింది.  వాల్యూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడు రెట్లు పెరిగాయి.  డీమెర్జర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీల్ ప్రకారం, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఎల్ షేర్ హోల్డర్లకు ఒక రిలయన్స్ షేరుకి ఒక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు ఇష్యూ చేస్తారు. ఈ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ నెల 20 రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిర్ణయించారు.

అందువలన ఇన్వెస్టర్లు రిలయన్స్ షేర్లను కొనడానికి ఈ నెల 19 వరకు (సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే వదిలేసి)  టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. జియో ఫైనాన్షియల్ షేర్లు మరో రెండు నుంచి మూడు నెలల్లో స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిస్టింగ్ అవుతాయని  అంచనా. రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జియో ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్ల లిస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అంబానీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. క్యాపిటల్ ప్రకారం  జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐదో అతిపెద్ద ఫైనాన్షియల్ కంపెనీగా నిలవనుంది. పేటీఎం, బజాజ్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పోటీ పడనుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాల్యూ ప్రకారం, ఈ కంపెనీ షేరు వాల్యూ రూ.190 గా ఉండొచ్చని మోతీలాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓస్వాల్ అంచనావేస్తోంది.

గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రోకరేజి కంపెనీ జేపీ మోర్గాన్ ఈ కంపెనీ షేరు వాల్యూ రూ.189 గా, జెఫరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.179 గా, సెంట్రమ్ బ్రోకింగ్ రూ.157 నుంచి రూ.190 గా  జియో ఫైనాన్షియల్ షేర్ల వాల్యూ ఉండొచ్చని పేర్కొన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేరు వాల్యూ రూ. 3 వేలను టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. జియో ఫైనాన్షియల్ వాల్యూని వదిలేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.2,825 గా మోతీలాల్ ఓస్వాల్ ఇచ్చింది. యూబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  కొనుగోలు రేటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి, రూ.3 వేలు టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరగా, జేపీ మోర్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెయిట్ రేటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి  రూ.2,960 టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరగా నిర్ణయించాయి.