తెలంగాణలో జియో ఫైబర్.. డబుల్ డేటా ఆఫర్స్

తెలంగాణలో జియో ఫైబర్.. డబుల్ డేటా ఆఫర్స్

హైదరాబాద్, వెలుగు: కరోనా లాక్‌డౌన్‌తో  డేటా వినియోగం బాగా పెరిగింది. ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో  డేటా వినియోగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జియో ఫైబర్ తన యూజర్లందరికీ అన్ని ప్లాన్స్ లోనూ డబుల్ డేటాను ఆఫర్ చేస్తోంది. తమ వినియోగదారులు హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్‌తో అనుసంధానమయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జియో ఫైబర్ చెప్పింది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో అత్యుత్తమ సేవలందిస్తున్నట్టు పేర్కొంది.  హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, కోదాడ, మహబూబ్ నగర్, నల్గొండలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో హై-స్పీడ్ బ్రాడ్ బాండ్ సేవలను అందించేందుకు తన నెట్ వర్క్ సామర్థ్యాన్ని  జియో పెంచింది. రాష్ట్రంలో దశల వారీగా జియో ఫైబర్ హై స్పీడ్ బ్రాడ్ బాండ్ అందుబాటులోకి తీసుకొచ్చింది.  రాష్ట్రంలో మరిన్ని నగరాలకు జియో ఫైబర్ సేవలు విస్తరించనున్నట్టు ప్రకటించింది.

 స్టే కనెక్టెడ్, స్టే ప్రొడక్టివ్…
స్టే కనెక్టెడ్, స్టే ప్రొడక్టివ్ లో భాగంగా జియో ఫైబర్ తన యూజర్లకు డబుల్ డేటా ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది. కొత్త యూజర్లకు 10 ఎంబీపీఎస్ స్పీడ్, 100 జీబీ డేటాతో ఉచిత కనెక్టివిటీ ఇస్తోంది. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, కోదాడ, మహబూబ్ నగర్, నల్గగొండలలో జియో ఫైబర్ తన హై స్పీడ్ బ్రాడ్ బాండ్ స్పీడ్ ను 1 గిగా ఫైబర్ దాకా పెంచింది.