
న్యూఢిల్లీ: ప్రిఫరెన్షియల్ షేర్ల ఇష్యూ ద్వారా రూ.348.15 కోట్లు సమీకరించామని రిలయన్స్ పవర్ బుధవారం ప్రకటించింది. కంపెనీ 9.55 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ అయిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు, ఒక కోటి షేర్లను బసేరా హోమ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (పబ్లిక్)కు జారీ చేసింది. మొత్తం 10.55 కోట్ల ఈక్విటీ షేర్లను షేర్కు రూ.33 ధర వద్ద జారీ చేశారు.
వీటి విలువ రూ.348.15 కోట్లు. ఈ ఫండ్స్ను రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో విస్తరించడానికి వాడతామని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ పవర్ షేర్లు బుధవారం 2 శాతం లాభపడి రూ.39 వద్ద ముగిశాయి. రిలయన్స్ గ్రూప్లో భాగమైన రిలయన్స్ పవర్, ప్రైవేట్ సెక్టార్లో ప్రముఖ పవర్ జనరేషన్ కంపెనీగా కొనసాగుతోంది. ఇది 5,305 మెగావాట్ల ఆపరేటింగ్ పోర్ట్ఫోలియోను కలిగి ఉంది.