జగిత్యాల మండలంలో అక్రమంగా వేసిన గుడిసెలు తొలగింపు

జగిత్యాల మండలంలో అక్రమంగా వేసిన గుడిసెలు తొలగింపు
  •     పలువురు సీపీఎం లీడర్ల అరెస్ట్

జగిత్యాల రూరల్, వెలుగు : జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులోని ప్రభుత్వ భూమిలో పట్టాల కోసం కొందరు గుడిసెలు వేస్కొని పోరాటం చేస్తుండగా.. ఆ గుడిసెలను పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు మంగళవారం తొలగించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని

సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. ఇండ్లు లేని పేదలు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా సీపీఎం లీడర్లు పిలుపునిచ్చారు. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని, ఇండ్ల పట్టాలు ఇవ్వాలని పేదలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 

కోరుట్ల :  నర్సింగపూర్ శివారులో పేదల గుడిసెలను అధికారులు తొలగించగా కోరుట్ల లో సీపీఎం జిల్లా నాయకులు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో కార్యకర్తలు కొత్త బస్టాండ్​ అంబేడ్కర్​ విగ్రహం వద్ద అందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్టాండ్​ ప్రాంతంలో మొహరించి సీపీఎం లీడర్లు, కార్యకర్తలు ఆందోళనను అడ్డుకున్నారు. తిరుపతి నాయక్ తో సహా 7 గురిని అదుపులోకి తీసుకొని , జగిత్యాలకు తరలించారు.