హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 15 ఏండ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని టీఎస్ఆర్టీసీ తెలిపింది. ప్రస్తుతం కాలం చెల్లిన బస్సులను సిటీ రోడ్లపై తిప్పడం లేదని స్పష్టం చేసింది. పాత బస్సులను స్క్రాప్చేసి, వాటి స్థానంలో కొత్తవాటిని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పింది. ప్రతి బస్సుకు ఏటా ఆర్టీఏ ఫిట్ నెస్, పొల్యూషన్అండర్కంట్రోల్టెస్టులు చేయిస్తున్నామని వివరించింది.
ఈ ఏడాది మార్చి నాటికి 466 ఆర్డినరీ బస్సులను రీప్లేస్ చేశామని వెల్లడించింది. కొత్తగా 445 మెట్రో ఎక్స్ప్రెస్, 229 ఆర్డినరీ, 125 మెట్రోడీలక్స్బస్సుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మోటార్వెహికల్ యాక్ట్ప్రకారం నడుచుకుంటున్నామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లేదని ఆర్టీసీ ముఖ్యఅధికారి ఒకరు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.