ఇక.. పంజాబ్ కింగ్స్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆక్షన్కు కొన్ని గంటల ముందు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ కీలక ప్రకటన చేసింది. తమ ఫ్రాంచైజీ పేరును ‘పంజాబ్ కింగ్స్’గా మార్చుకున్నట్లు బుధవారం ప్రకటించింది. ఫ్రాంచైజీ కొత్త లోగోను కూడా రిలీజ్ చేసింది. గురువారం జరిగే ఐపీఎల్ ఆక్షన్లో కూడా పంజాబ్ కింగ్స్ పేరుతోనే పాల్గొంటోంది. తమ కొత్త లోగో, బ్రాండ్ నేమ్ ఇతర టీమ్స్ మధ్య తమను ప్రత్యేకంగా నిలబెడతాయని పంజాబ్ కింగ్స్ సీఈవో సతీశ్ మీనన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతీ జింటా, కరన్ పాల్కు చెందిన పంజాబ్2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి లీగ్లో భాగంగా ఉంది. కానీ, ఈ13 ఏళ్లలో ఆ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేదు. 2014 సీజన్లో రన్నరప్గా నిలవడమే ఇప్పటిదాకా బెస్ట్ పెర్ఫామెన్స్. పేరు మారిన తర్వాతైనా ఆ టీమ్ రాత మారుతుందేమో చూడాలి.
For More News..