- విమానాశ్రయాల పునరుద్ధరణ
జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సహా పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయలను మూసివేస్తూ ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం.. వాటిని ఉపసంహరించుకుంది. ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. ఎయిర్ పోర్టులను పునరుద్ధరించాలని ఆదేశించింది. పౌర విమానాల రాకపోకలను యధాతథస్థితికి తీసుకుని రావాలని సూచించింది. ఈ ఆదేశాలు వెలువడిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే జమ్మూ విమానాశ్రయం తెరచుకుంది. విమానాల రాకపోకలు మొదలయ్యాయి.
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణనాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ఎనిమిది విమానాశ్రయాలను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వెలువడిన వెంటనే చండీగఢ్, జమ్మూ, శ్రీనగర్, లేహ్ సహా పంజాబ్ లోని అమృత్ సర్, పఠాన్ కోట్, హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి, కంగ్రా, సిమ్లా ఎయిర్ పోర్టులను మూసివేశారు. అంతేకాదు ఐరోపా, గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి పాకిస్తాన్ గగనతలాన్ని వినియోగించుకోకూడదని కూడా ఆదేశాలు వెలువడ్డాయి.
NOTAM (Notice to Airmen to alert aircraft pilots of potential hazards along a flight route) has been withdrawn. Flight operations will resume pic.twitter.com/5WvzEgVQ34
— ANI (@ANI) February 27, 2019