18 ఏళ్ల తర్వాత రేణూ దేశాయ్ రీఎంట్రీ

18 ఏళ్ల తర్వాత రేణూ దేశాయ్ రీఎంట్రీ

మోడల్‌‌, నటి, డైరెక్టర్‌‌, ఎడిటర్‌‌, కాస్ట్యూమ్ డిజైనర్‌‌‌‌గానే కాక నిర్మాతగానూ తన టాలెంట్ ఏంటో ఇండస్ట్రీకి చూపించారు రేణు దేశాయ్. ఇప్పుడు మరోసారి తన నటనతో ఆకట్టుకోవడానికి వస్తున్నారు. రవితేజ హీరోగా వంశీ తెరకెక్కిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో పద్దెనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు రేణు. డెబ్భైల కాలంలో స్టూవర్ట్‌‌పురంలో సంచలనం సృష్టించిన గజదొంగ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో రేణు కూడా రియల్ లైఫ్‌‌ రోల్‌‌లోనే కనిపించనున్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన రైటర్, సోషల్ వర్కర్ హేమలత లవణం పాత్ర చేస్తున్నారామె. ఈ విషయాన్ని రివీల్ చేస్తూ వదిలిన వీడియోలో ఖద్దరు చీర కట్టుకుని, కళ్లజోడు పెట్టుకుని, ఉద్యమానికి తరలి వెళ్తూ కనిపిస్తున్నారు రేణు.

నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీని విడుదల చేయనున్నారు.