రైల్వే సమస్యలు పరిష్కరించాలని పెద్దపల్లి ఎంపీకి వినతి

రైల్వే సమస్యలు  పరిష్కరించాలని పెద్దపల్లి ఎంపీకి వినతి

గోదావరిఖని, వెలుగు : రైల్వే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను సికింద్రాబాద్​ డివిజన్​ రైల్వే డీఆర్​యూసీసీ మెంబర్​ అనుమాస శ్రీనివాస్​(జీన్స్​) గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. బల్హార్ష నుంచి కాజీపేట వరకు నడిచే అజ్నీ ట్రైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సికింద్రాబాద్​ వరకు పొడిగించాలని, రామగుండం రైల్వే స్టేషన్​ ద్వారా సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉదయం 4.20 గంటల తర్వాత నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రైలు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. 

రామగుండం నుంచి మణుగూరు వరకు రైల్వే లైన్​ నిర్మాణం తొందరగా చేపట్టాలని, ఈ అంశాలను రైల్వే అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చూడాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణను కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.