హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో గెజిటెడ్ హెడ్మాస్టర్ల బదిలీలకు సంబంధించిన రీషెడ్యూల్ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన గురువారం రిలీజ్ చేశారు. హెడ్మాస్టర్లు ఈ నెల 15, 16 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. 17న ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్ ఇవ్వనున్నట్టు చెప్పారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 12, 13 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తికా వాల్సి ఉంది. కానీ, బదిలీలకు సంబంధిం చిన జీవో 5 సవరణ చేయకుండా కటాఫ్ డేట్ మార్చారనే దానిపై కొందరు టీచర్లు కోర్టును ఆశ్రయించారు.
దీంతో విద్యాశాఖ అధికారులు ఆ జీవోను సవరించి కోర్టుకు అందించారు. ఈ నేపథ్యంలో రీషెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పటికే 1,793 మంది హెచ్ఎంలు బదిలీల కోసం అప్లై చేశారు. వీరిలో మల్టీజోన్ 1లో గవర్నమెంట్ స్కూళ్ల నుంచి 69 మంది, జెడ్పీ స్కూళ్ల నుంచి 799 మంది ఉండగా, మల్టీజోన్ 2లోని గవర్న మెంట్ స్కూల్స్ నుంచి 66 మంది, జెడ్పీ స్కూళ్ల నుంచి 859 మంది దరఖాస్తు చేశారు.