వరదలతో బ్రెజిల్ అతలాకుతలం.. 105 మంది మృతి

వరదలతో బ్రెజిల్ అతలాకుతలం.. 105 మంది మృతి

భారీ వర్షాలు, వరదలతో బ్రెజిల్ అతలాకుతలం అవుతోంది. బ్రెజిల్ వరదల్లో మృతుల సంఖ్య 105కి పెరిగింది. బ్రెజిల్ లోని పెట్రోపొలిస్ నగరంలో మంగళవారం వరదలు, మట్టిచరియలు నివాస ప్రాంతాలపై విరుచుపడ్డాయి. ఈ విప్తతులో 105 మంది చనిపోయినట్లు రియో డిజనేరో రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఇంకా 35 మంది ఆచూకీ తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఎటుచూసినా.. బంధుమిత్రుల ఆచూకీ కోసం జనం మట్టిని తవ్వుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. వరద ప్రవాహం ఇంకా తగ్గలేదు. వీధుల్లో కార్లు గుట్టల్లా పోగయ్యాయి. మూడు గంటల్లోనే 25.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు అధికారులు. వరదల్లో చిక్కుకున్న 24 మందిని కాపాడినట్లు తెలిపారు అధికారులు. హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు అధికారులు.