పేటిఎంకు షాకిచ్చిన ఆర్బీఐ.. కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయకూడదని ఆదేశాలు..

పేటిఎంకు షాకిచ్చిన ఆర్బీఐ.. కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయకూడదని ఆదేశాలు..

పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ గట్టి షాకిచ్చింది. ఫిబ్రవరి 29, 2024 తర్వాత ఏవైనా కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, ఎన్సీఎమ్సీ కార్డ్‌లు మొదలైన వాటిలో ఎలాంటి వడ్డీ, క్యాష్‌బ్యాక్‌లు లేదా ఇతర డిపాజిట్లు అనుమతించబడవని తెలిపింది. సమగ్ర సిస్టమ్‌ ఆడిట్‌, బయటి ఆడిటర్ల నివేదికలను అనుసరించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. బ్యాంక్‌లో నిబంధనల ఉల్లంఘనను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది.

  సేవింగ్స్‌ అకౌంట్‌, కరెంట్‌ అకౌంట్‌, ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌, ఫాస్టాగ్స్, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్స్‌లో నిల్వ ఉన్న మొత్తాల విత్‌డ్రా, వినియోగం విషయంలో కస్టమర్లపై ఎలాంటి ఆంక్షలూ ఉండవని ఆర్‌బీఐ స్పష్టంచేసింది. వడ్డీ, క్యాష్‌బ్యాక్‌, రీఫండ్లను ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. 2022లో కూడా పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంది. కొత్త కస్టమర్‌లను చేర్చుకోవడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. కొత్త అకౌంట్ ఓపెన్ చేయడాన్ని ఆర్బీఐ నిలిపివేయాలని ఆదేశించింది.