తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవలు పునః ప్రారంభం అయ్యాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా నిత్య, ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనే అవకాశం లేకుండా పోయిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనల ఆటంకాలన్నీ తొలగిపోవడంతో ఇవాళ్టి నుంచి ఆర్జిత సేవలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. కరోనా కారణంగా నిలుపుదల చేసిన సేవలన్నీ నేటి నుంచి ప్రారంభించామని టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
శ్రీవారి సేవల్లో భక్తులు నేరుగా పాల్గొనే అవకాశాన్ని కల్పించామన్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన సేవలు మళ్లీ పునరుద్ధరించడంతో భక్తులు ఎంతో ఆనందంగా శ్రీవారి ఆర్జిత., నిత్య సేవల్లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. కరోనా నుంచి మానవాళిని శ్రీవారు రక్షించారని ఆయన పేర్కొంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
సర్కార్ తప్పులు గుర్తు చేసేందుకు ఈనెల 9న యుద్ధభేరి
యుద్ధంపై భారత విధానం బాగుందన్న రష్యా మంత్రి
రాజ్నాథ్సింగ్తో బండి సంజయ్ భేటీ