నూతన పెన్షన్ విధానం వద్దు..సిద్దిపేటలో నిరసన ప్రదర్శన 

నూతన పెన్షన్ విధానం వద్దు..సిద్దిపేటలో నిరసన ప్రదర్శన 

సిద్దిపేట టౌన్, వెలుగు: కేంద్రం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ ​విధానం వద్దని శనివారం సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.  వెంటనే దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ, రాష్ట్ర పెన్షనర్ల ఫెడరేషన్ పిలుపుమేరకు ఈ నెల 23న  జిల్లాలోని పెన్షనర్లు పలు డిమాండ్లతో కూడిన విజ్ఞాపన పత్రంపై సంతకాలు చేసి కలెక్టర్ ద్వారా దేశ ప్రధానికి పంపుతున్నట్లు తెలిపారు.

జిల్లాలోని  పెన్షనర్లందరూ సిద్దిపేట కలెక్టరేట్ వద్దకు 23న  ఉదయం11 గంటల వరకు రావాలని పిలుపునిచ్చారు. ఆందోళనలో తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ జిల్లా ప్రతినిధులు భిక్షపతి, మధుసూదన్ రెడ్డి, అన్నమరెడ్డి , నరసింహులు, అంజిరెడ్డి, వెంకటయ్య, నాగేందర్, నరసింహారెడ్డి, ప్రభాకర్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, బన్సీలాల్, లక్ష్మారెడ్డి, శ్రీధర్, విష్ణు, గౌరయ్య, వేణుగోపాల్, విజయకుమార్, మల్లయ్య , సత్తయ్య, పరశురాములు, విజయకుమార్ పాల్గొన్నారు