రెడ్కో చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ శరత్

రెడ్కో చైర్మన్గా  రిటైర్డ్ ఐఏఎస్ శరత్
  • సీఎస్ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్​, వెలుగు : తెలంగాణ రెన్యువబుల్​ఎనర్జీ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ (రెడ్కో) చైర్మన్​గా రిటైర్డ్ ఐఏఎస్​ శరత్​ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్​ రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా.. శరత్​ గతంలో ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్​ రెడ్డి కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం సీరియస్​ అవ్వడమే కాకుండా, అధికారులు ఈ తీరును మార్చుకోకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు.