
గ్రేటర్వరంగల్, వెలుగు: రిటైర్డ్ లెక్చరర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు వరంగల్ కాకతీయ మెడికల్కాలేజీకి డొనేట్ చేసి సామాజిక బాధ్యతను చాటారు. వరంగల్సిటీకి చెందిన రిటైర్డ్ లెక్చరర్ బోయిన ప్రభాకర్యాదవ్(76) మంగళవారం చనిపోయారు. ఆయన భార్య ఉమాదేవి, కుమార్తెలు శ్రీలత, వాసవి, అల్లుడు సునీల్నిర్ణయం మేరకు సమాజహితం కోరి మెడికల్కాలేజీకి దానం చేసినట్టు తెలంగాణ నేత్ర దాతల అసోసియేషన్ప్రెసిండెంట్మల్లారెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్సంధ్య తెలిపారు. దత్తు యాదవ్, శ్రీనాత్ బాబు, రామకృష్ణ, సత్యనారాయణ రెడ్డి, మృతుడి కుటుంబ సభ్యులు ఉన్నారు.