సంగారెడ్డి, వెలుగు: ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓ మాజీ సైనికుడు 148 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలకేంద్రంలో బుధవారం మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఓటు వేసేందుకు రిటైర్డ్ మిలటరీ ఉద్యోగి మల్లయ్య హైదరాబాద్ లోని లింగంపల్లి బీహెచ్ఈఎల్ నుంచి సైకిల్పై బయల్దేరారు. బుధవారం తెల్లవారుజామున 4:20 గంటలకు బయల్దేరి ఉదయం 10 గంటల వరకు మనూర్ గ్రామానికి చేరుకున్నాడు. ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి అదే సైకిల్పై హైదరాబాద్కు వెళ్లిపోయాడు.
