సంజయ్​ని మార్చినట్టు.. రేవంత్​ను మార్చలేరు : మల్లు రవి

సంజయ్​ని మార్చినట్టు..  రేవంత్​ను మార్చలేరు :  మల్లు రవి

హైదరాబాద్​, వెలుగు: కేసీఆర్ మాట విని బీజేపీ.. సంజయ్​ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిందని, సంజయ్​ని మార్చినట్టు రేవంత్​ను మార్చలేరని పీసీసీ సీనియర్ వైస్​ ప్రెసిడెంట్​ మల్లు రవి అన్నారు. దాసోజు శ్రవణ్ ఇంకా కాంగ్రెస్​ పార్టీలోనే ఉన్నానన్న భ్రమలోనే ఉన్నట్టున్నారని మండిపడ్డారు. అందుకే రేవంత్​ రెడ్డి మీద ఫిర్యాదు చేస్తూ దాసోజు ఏఐసీసీకి లేఖ రాశారన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో బూతులు తిట్టే సంప్రదాయం కేసీఆర్​ నుంచే వచ్చిందని గుర్తుచేశారు. తిట్లలో కేసీఆర్​ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్​ అని ఎద్దేవా చేశారు.