శ్రీశైలం వెళ్తున్న రేవంత్ రెడ్డి అరెస్ట్

శ్రీశైలం వెళ్తున్న రేవంత్ రెడ్డి అరెస్ట్

డిండి వద్ద అడ్డుకున్న పోలీసులు

కావాలంటే పోలీసు వెహికల్ లోనే వస్తానన్న రేవంత్ రెడ్డి

హైదరాబాద్: శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.  శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాల పరామర్శకు వెళుతోన్న ఎంపీ రేవంత్ రెడ్డిని దిండి వద్ద పోలసులు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసుల ను రేవంత్ రెడ్డి గట్టిగా ప్రశ్నించారు. చనిపోయిన కుటుంబాల పట్ల మాకు సానుభూతి ఉంది.. వారిని పరామర్శించి, న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అడిగాల్సిన అవసరం ఉంది… మమ్మల్ని ఆపడం సరికాదు.. కావాలంటే పోలీసు వెహికిల్ లోనే వస్తా… సీబీసీఐడీ ఉంది… సీన్ ఆఫ్ అఫెన్స్ కు ఇబ్బంది అనుకుంటే, ఆ పరిధి వరకు తాడు కట్టుకోండి… అని రేవంత్ రెడ్డి చెప్పినా వారు వినిపించుకోలేదు. బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.