
హైదరాబాద్, వెలుగు: ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దిన బైసన్ పోలో గ్రౌండ్ ను కాంక్రీట్ జంగిల్గా మార్చి సెక్రటేరియట్ కట్టాలని సీఎం కేసీఆర్ అనుకున్నాడని, తమ పోరాటం వల్ల అది జరగలేదని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న పార్టీలో 23 మందే గెలిచినట్లు.. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 12 మందే మిగులుతారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కు టుంబం ఓడిపోయిందని, ప్రజలు గెలిచారని అన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన చేస్తున్నారన్నారు. మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెల్చిన సందర్భంగా సోమవారం కంటోన్మెంట్ కాంగ్రెస్ కమిటీ కన్వీనర్ సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు.